ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేసిన ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి అంబేద్కర్, దళిత సంఘాల నాయకులు పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగర్ ఆఫ్ కిష్టయ్య, నూకల బానయ్య, ఎరుకల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
దళిత బహుజన వర్గాలకు అండగా శ్రీధర్ బాబు దళిత బహుజన వర్గాలకు అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అని తెలంగాణ నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షులు సేగ్గం రాజేష్ అన్నారు. మంథనిలో అంబేద్కర్ భవన నిర్మాణానికి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోటి రూపాయలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.
Admin
E Nivas News