ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో 'మహాలక్ష్మి' పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ సదుపాయాన్ని మరో ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు విస్తరించడానికి పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం 42.90 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతుండగా, తాజాగా గుర్తించిన కొత్త లబ్ధిదారుల జాబితా ప్రభుత్వ ఆమోదం కోసం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. 2024 ఫిబ్రవరిలో విడుదలైన నోటిఫికేషన్కు 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే కొత్త లబ్ధిదారులకు సబ్సిడీ అందుబాటులోకి రానుంది. దీంతో ఇదివరకు గ్యాస్ పథకం వర్తించిన వారికి మంచి అవకాశం కల్పించింది.
Admin
E Nivas News