ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని లగ్గాం వద్ద కల్వాడ నుండి ఒడ్డుగూడ వరకు ఉన్న బీటీ రోడ్డు పనులను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. గతంలో కురిసిన వర్షాలకు దెబ్బతినడంతో మరమ్మతులకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఆర్ అండ్ బి రోడ్డు మరమ్మతులతో పాటు కల్వాడ నుండి ఒడ్డుగూడ వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. హ్యమ్ ఫేస్1 కింద ఆ పనులను కూడా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ రంజిత్, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయ్, మండల అధ్యక్షులు దామోదర్, దూగుంట రాజన్న, కొఠారి బాపు, గోపాల్, బొజ్జు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News