ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికలవిద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విధులపట్లసమయపాలన పాటించాలని, వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించే విధంగా కృషి చేయాలని తెలిపారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దార్ పుష్పలత తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను పరిశీలించారు. ప్రజల నుండి సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియలో జాగ్రత్త వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా వివరాలు నమోదు చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రక్రియ వేగవంతానికి బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత సహకారం తీసుకోవాలని తెలిపారు. భూభారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. మండల ప్రజా పరిషత్కార్యాలయాన్ ఆకస్మికంగాసందర్శించి మండలంలోని గ్రామపంచాయతీల పనితీరు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసే వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, త్రాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతిరోజు పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది విదులపట్లసమయపాలన పాటించాలని, గ్రామాలలో అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతి పనిని బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు.గ్రామపంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా సమన్వయంతో పని చేయాలని తెలిపారు.అనంతరం లక్షెట్టిపేట మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అత్యవసర విభాగం, సామాజిక వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఓ.పి. రిజిస్టర్ అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం అయినందున అంటువ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని,తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు.అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ఆసుపత్రి పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తో కలిసి మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వంటశాలను పరిశీలించి వంట సిబ్బంది ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు,నా న్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News