ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాత శిశు సంక్షేమ సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణ పనులను త్వరితగతన పూర్తి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని నూతనంగా నిర్మిస్తున్న మాత శిశు & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ అనుకున్న సమయానికి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలందరికీ వైద్య సేవలను అందిస్తామని చెప్పారు. నాణ్యమైన పనులను నిర్మించి ఎల్లకాలం ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. నాణ్యత విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Admin
E Nivas News