Tuesday, 15 September 2026 09:13:37 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకు రావాలి

అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్

Date : 23 October 2025 06:37 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో వచ్చే పత్తి పంటను కనీసం మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ కలెక్టరేట్ లో పత్తి కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్ ను అధికారులు అదనపు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2025-26 ఖరీఫ్ సీజన్లో మహబూబాబాద్ జిల్లాలో 84 వేల 718 ఎకరాలలో పత్తి పంట సాగు జరిగిందని, 6 లక్షల 14 వేల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా ఉందని అన్నారు. జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి పంట కొనుగోలు చేసేందుకు 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కనీస మద్దతు ధర రూ.8110/- ఉన్నదని. పత్తి రైతులు తమ పత్తిని తక్కువ ధరకు దళారులకు కానీ, మధ్యవర్తులకు కానీ, ఇతరులకు కానీ అమ్ముకోకుండా పత్తి ధర కనీస మద్దతు ధర కన్నా తక్కువగా ఉన్నప్పుడు సీసీఐ వారిచే మహబూబాబాద్ మార్కెట్ యార్డ్ పరిధిలో ఒక జిన్నింగ్ మిల్లు, కేసముద్రం మూడు జిన్నింగ్ మిల్లులు, తొర్రూరు మార్కెట్ యార్డ్ రెండు జిన్నింగ్ మిల్లులు, మొత్తం 6 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.పత్తి రైతులు తమ పత్తిని తీసుకొని వచ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పరిగణలోకి తీసుకొవాలని, నాణ్యమైన పత్తి పంటను వెంటనే కనీస మద్దతు ధర పై కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి పంట కొనుగోలు నిమిత్తం జిన్నింగ్ మిల్లులో నీరు, టాయిలెట్ అవసరమైన పరికరాలు మొదలగు సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు పత్తి పంట తీసుకొని వచ్చే రైతులు తమ బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో లీంక్ చేయాలని, దీనిపై రైతులలో అవసరమైన అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర కంటే తక్కువకు పత్తి పంట అమ్మవద్దని, మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దని, ప్రైవేట్ వ్యాపారుల వద్ద మద్దతు ధర లభించని పక్షంలో నేరుగా జన్మింగ్ మిల్లులకు వచ్చి పత్తి పంట అమ్ముకోవాలని సూచించారు. పత్తి కొనుగోలు కేంద్రాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని అన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద అగ్ని ప్రమాద నివారణ చర్యలు పటిష్టంగా తీసుకోవాలని సూచించారు. అలాగే *కప్పాస్ కిసాన్ యాప్* ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, అలాగే పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి , జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, అసిస్టెంట్ రవాణా శాఖ అధికారి సాయి చరణ్, మార్కెట్ కార్యదర్శులు, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు ఓనర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: