Saturday, 12 September 2026 10:39:31 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

యువత రాజకీయాల్లోకి రావాలి...! దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలి...

ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల లోగో ఆవిష్కరించిన ఈ.టి. నర్సింహా

Date : 01 August 2026 09:05 PM Views : 79

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : యువత రాజకీయాల్లోకి రావాలి, దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని, కేంద్ర యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యమాల్లోకి రావాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు ఈటీ. నర్సింహా పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లో నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల లోగోను ఈటీ. నర్సింహా ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు ఈటీ. నర్సింహా మాట్లాడుతూ భారతదేశంలో అత్యధిక జనాభా యువతదే అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానాలు యువతకు ఉపాధి, విద్య, భద్రత కల్పించే దిశగా కాకుండా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనీకరణ వైపు సాగుతున్నాయని విమర్శించారు. జాతీయ యువజన విధానం పేరుతో ప్రకటనలు చేస్తున్నా, యువతకు శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, అందుబాటు వైద్యం,నైపుణ్యాభివృద్ధి, ప్రజాస్వామ్య భాగస్వామ్యం వంటి అంశాలపై స్పష్టమైన హామీలు అమలు కావడం లేదన్నారు. దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయకుండా, ఎన్నికల సమయంలో మాత్రమే యువతను గుర్తు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.యువత రాజకీయాలకు దూరంగా ఉంటే ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం రాదన్నారు. పాలకులను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై పోరాడడం, రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పరిరక్షణలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ హక్కు, విద్య హక్కు, వైద్య హక్కు, కార్మిక హక్కులు, మహిళల భద్రత, రైతుల సంక్షేమం, శాస్త్రీయ దృక్పథం వంటి అంశాలపై ఉద్యమాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అదే విధంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే ఏ ఐ వై ప్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు యువతకు కొత్త దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన విధానాలు, నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యా, వైద్య రంగాల పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, శాంతి, శాస్త్రీయ సోషలిజం వంటి అంశాలపై సమగ్ర చర్చలు జరిపి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో మహాసభల్లో పాల్గొని వాటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బిజ్జా శ్రీనివాసులు, లింగం రవి, నానాబాల రామకృష్ణ, టి. సత్య ప్రసాద్, పేరబోయిన మహేందర్, శ్రీమాన్, యుగంధ ర్,రాష్ట్ర సమితి సభ్యులు ఆర్. బాలకృష్ణ, సల్మాన్ బేగ్, షేక్ మహమూద్, ఎల్లంకి మహేష్, పి. శివ కుమార్, నయీమ్, కొంకుల రాజేష్, మధు, మానస్ కుమార్, రాజ్ కుమార్, శేఖర్, చింతల రమేష్, శ్రీనివాస్, రాము, మహేందరతదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: