Tuesday, 28 July 2026 10:55:07 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

సరిహద్దులోనూ అక్రమ రవాణాలను పూర్తిగా అరికట్టాలి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 23 December 2025 08:50 PM Views : 203

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మహారాష్ట్ర సరిహద్దు నుండి అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా అడ్డుకట్ట వేయగలరని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం గాదిగూడ పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. మొదటగా సిబ్బందిచే ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. సిబ్బందిచే పరేడ్ నిర్వహించి పరేడ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. పోలీసు ప్రతి ఒక్కరూ సక్రమమైన యూనిఫామ్ ధరించాలని, విధులలో నీతి నిజాయితీ, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ విపిఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు గుండా రాయితీ బియ్యం, గుడుంబా, గంజాయి తరలకుండా చర్యలు చేపట్టాలని మండల పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనకు వాటి వల్ల కలుగు అనార్థాలపై ప్రజలకు సవివరంగా తెలియజేసి చైతన్య పరచాలని తెలిపారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉండాలని, సిబ్బంది విధుల పై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా పర్యవేక్షించాలని, ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ ను పరిశీలించి బాధితుల సమస్యల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. స్టేషన్లో పెండింగ్ లో ఉన్న రికార్డులు త్వరితగతిన పూర్తి చేసి ఛార్జ్ షీటు దాఖలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి ప్రణయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :