ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాప గిరి గ్రామంలో శనివారం డి.ఎం.ఎఫ్. టి. నిధుల క్రింద రూ. 8.లక్షలు మంజూరు కాగా ఆ పని మాజీ ఎంపీటీసీ మహేష్ రవీందర్రావు డ్రైనేజ్ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. డీఎంఎఫ్టి నిధుల నుండి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపీటీసీ మహేష్ రవీంద ర్రావు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి బియ్యన రాజయ్య, వార్డు మెంబర్లు జక్కుల మహేందర్, గుంటి చందు, గ్రామస్తులు రాజబాబుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News