Thursday, 30 July 2026 12:38:52 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

శాంతియుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం

రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా

Date : 10 December 2025 08:30 PM Views : 289

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోలీసుల పటిష్టమైన భద్రతతో స్వేచ్ఛ, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మొదటి విడత కాల్వ శ్రీరాంపూర్, కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం 05 మండలాలలో 95 గ్రామపంచాయతీలు 685 పోలింగ్ కేంద్రాలలో, 135 పోలింగ్ లొకేషన్స్, మంచిర్యాల జోన్ పరిధిలోదండేపల్లి, జన్నారం, లక్షేట్టిపేట 04 మండలాలలో 81 గ్రామపంచాయతీలు, 514 పోలింగ్ కేంద్రాలలో,143 పోలింగ్ లొకేషన్స్.మొత్తం రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి లో 1712 మొత్తం పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు- 1174, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు- 538 ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఫలితాలు వెల్లడించిన తరువాత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. పెద్దపల్లి జోన్ పరిధిలో 04 (గోదావరి బ్రిడ్జ్ , ఎక్లాస్ పూర్, దుబ్బపల్లి ,గుంపుల ) మంచిర్యాల జోన్ పరిదిలో 05 (పారేపల్లి X రోడ్,తాండూర్ ఐబి, ఇందానపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్, గూడెం ,ఇందారం)ల వద్ద ఏర్పాటు చేసినా చెక్ పోస్ట్ లలో నిరంతరం నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24 / 7వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుం దన్నారు.ఎన్నికల కోడ్ అమలు చేయబడిన రోజు నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నగదు : 03 కేసులలో 6,84,910 లక్షలు సిజ్ చేశామన్నారు. లిక్కర్ సంబందించి 200 కేసు లలో 1323 లీటర్లు సిజ్ దాని విలువ 8,57,553 ఉంటుందన్నారు. గంజాయి 03 కేసులు 1750 గ్రామ్స్ సిజ్, దాని విలువ 87,000 విలువ అన్నారు.పిడియస్ రైస్ కేసు 01, 17 క్వింటాళ్లు సిజ్, దాని విలువ 30,000 ఉందన్నారు. మొత్తం విలువ 16,59,463 సీజ్ చేసామన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో 357 కేసులలో 781 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరిపై పై 01 ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి కేసుల నమోదు చేశామన్నారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో 35 గన్ లైసెన్లు కలిగినటువంటి 34 మంది గన్స్ డిపాజిట్ చేయడం జరిగింది. 01 ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని30 లైసెన్సులు 47 గన్స్ బ్యాంకులకు సంబంధించినవి కలవన్నారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డీసీపీ -02, ఏసీపీ -06, సీఐ-30,ఎస్ ఐ లు - 95, ఏఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్- 270, కానిస్టేబుల్ - 520, హోం గార్డ్స్ - 240, ఆర్మూడ సిబ్బంది - 170, క్యూ ఆర్ టి టీమ్స్ - 72, మిగతా సిబ్బంది -200 సుమారు 1600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం కమిషనరేట్ పరిధిలో జరగబోయే మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు విస్తృతమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు, ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కంట్రోల్ రూమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, పోలీస్ పికెట్‌లు, మొబైల్ ప్యాట్రోలింగ్ ఏర్పాటు చేశాం అని తెలిపారు. గుంపులుగా తిరగడం, గొడవలకు, బెదిరింపులకు, దాడులకు పాల్పడడం, డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకి పాల్పడడం నిబంధనలకు విరుద్ధం, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా, దైర్యంగా స్వేచ్చయుత వాతావరణం లో తమ ఓటు హక్కు వినియోగించుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :