Sunday, 13 September 2026 02:33:20 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

రూ.24.18 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్...

పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి

Date : 17 August 2026 09:50 PM Views : 136

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 24.18 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం చేసినందుకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డిఎస్పి రాంరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ జి. కృష్ణ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కేసు వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో కే ఎం ఎస్ 2023-24లో సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలోని ఎంఎస్. లక్ష్మి ఇండస్ట్రీస్కు కస్టమ్ మిల్లింగ్ కోసం 10,015.636 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అప్పగించారు. అప్పగించిన ధాన్యానికి అనుగుణంగా 6,662.880 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా,మిల్లర్ ఇప్పటివరకు 1,577.289 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యాన్ని మాత్రమే అందించారు. అదనంగా 64.872 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ కు సమానమైన నగదు స్వీకరించబడింది. దీంతో 5,020.719 మెట్రిక్ టన్నుల CMR బియ్యం బకాయి ఉండగా,దానికి సమానమైన 7,493.610 మెట్రిక్ టన్నుల ధాన్యం డిఫాల్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు.దీని ద్వారా ప్రభుత్వానికి జరిగినట్లు గుర్తించిన ఆర్థిక నష్టంరూ.24,18,59,070/-గా ఉంది. 06-08-2026న సివిల్ సప్లైస్ అధికారులు ఎంఎస్.లక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును భౌతికంగా తనిఖీ చేశారు.తనిఖీ సమయంలో కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్‌కు అప్పగించిన ప్రభుత్వ ధాన్యానికి సంబంధించిన స్టాక్ మిల్లు ప్రాంగణంలో భౌతికంగా అందుబాటులో లేదని గుర్తించారు. అప్పగించిన ప్రభుత్వ ధాన్యం నిల్వలను సక్రమంగా లెక్కల్లో చూపకపోవడంతో, ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. టీజీఎస్సీ ఎస్సీఎల్ పెద్దపల్లి జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం,బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :