ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ కాలనీలో సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ( ఎస్ సి సి డబ్ల్యూ యు - ఐ ఎఫ్ టి యు ) ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్ల ప్రతులను శనివారం నాయకులు దగ్ధం చేశారు. అనంతరం ( ఎస్ సి సి డబ్ల్యూ యు) సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఉపాధి భద్రత, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి, నిన్న నాలుగు లేబర్ కోడ్ల అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆర్డర్లు జారీ చేయడం జరిగిందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి. పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్. తీసుకురావడం జరిగిందని, ఈ కోడ్ వల్ల అన్ని రకాల కార్మికులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటికరించి అందుట్లో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడం కొరకు, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడం కొరకు నరేంద్ర మోడీ ఈ నాలుగు లేబర్ కోడ్లను అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నా రన్నారు. ఎనిమిది గంటల పని విధానం స్థానంలో 12 గంటలు పని విధానం తేవడం, అతి తక్కువ వేతనాలతో ప్రైవేట్ కంపెనీలు పని చేయించుకోవడం కొరకు కార్పొరేట్ శక్తులకు ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉపయోగపడతాయన్నారు. సరైన వేతనాలు లేక నాణ్యమైన భోజనం లేక, పరిశ్రమల్లో పనిచేయడం వల్ల కార్మికులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉందన్నారు. అన్ని రకాల కార్మికులు నరేంద్ర మోడీ తీసుకు వచ్చిన 4 లేబర్ కోడ్లు వల్ల ఎంత ప్రమాదం ఉందో అర్థం చేసుకొని ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్ల ను రద్దు చేసేవరకు ఉద్యమించాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నా మన్నారు. కార్మికులు నాలుగు లేబర్ కోడ్ల కోసం జరిగే ఉద్యమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, బండారి రాజు, అప్పారావు, సుధాకర్, శంకర్ రాము, రాంబాబు, సమ్మయ్య, సుప్రియ, సత్య, శారద, కవిత, మల్లేశ్వరి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News