Saturday, 13 June 2026 01:16:45 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

జిల్లాలో పటిష్టంగా రోడ్డు భద్రత నిబంధనలు అమలు

జిల్లా రవాణా అధికారి సిహెచ్.రంజిత్

Date : 23 December 2025 09:01 PM Views : 147

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా రవాణా అధికారి సిహెచ్.రంజిత్ మంగళవారంఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనదారులకు సరైన ధ్రువపత్రాలు లేకున్నా, నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యాలయానికి నిర్దేశించిన 69.63 కోట్ల రూపాయల ఆదాయ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 55.48 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 48 ఓవర్‌ లోడింగ్ కేసులు నమోదు చేయడం జరిగిందని, 77 డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేయడం జరిగిందని, వసూలు చేయబడిన పన్ను,జరిమానాతో కలిపి మొత్తం 27.92 కోట్ల రూపాయలు కాంపౌండింగ్ రుసుము వసూలు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వుల ప్రకారం ఒకే వాహనం ఒక సంవత్సరం లోపు 2వ సారి,అంతకంటే ఎక్కు వసార్లు ఓవర్‌లోడ్ చేయబడినట్లు గుర్తించినట్లయితే, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ అథారిటీ చట్టం ప్రకారం 6 నెలల పాటు వాహనం అనుమతిని సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. సస్పెన్షన్ సమయంలో ఏదైనా సస్పెండ్ చేయబడిన వాహనం తిరుగుతున్నట్లు గుర్తించినట్లయితే, వాహనాన్ని స్వాధీనం చేయడం జరుగుతుందని, వాహన యజమానులు, డ్రైవర్లు మోటారు వాహన0 నియమాలను ఖచ్చితంగా పాటించాలని, ఓవర్‌లోడింగ్‌ను నివారించాలని, సురక్షితమైన ప్రయాణానికి, రవాణాకు సహకరించాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :