ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా రవాణా అధికారి సిహెచ్.రంజిత్ మంగళవారంఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనదారులకు సరైన ధ్రువపత్రాలు లేకున్నా, నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యాలయానికి నిర్దేశించిన 69.63 కోట్ల రూపాయల ఆదాయ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 55.48 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 48 ఓవర్ లోడింగ్ కేసులు నమోదు చేయడం జరిగిందని, 77 డ్రైవింగ్ లైసెన్స్లు సస్పెండ్ చేయడం జరిగిందని, వసూలు చేయబడిన పన్ను,జరిమానాతో కలిపి మొత్తం 27.92 కోట్ల రూపాయలు కాంపౌండింగ్ రుసుము వసూలు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వుల ప్రకారం ఒకే వాహనం ఒక సంవత్సరం లోపు 2వ సారి,అంతకంటే ఎక్కు వసార్లు ఓవర్లోడ్ చేయబడినట్లు గుర్తించినట్లయితే, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ అథారిటీ చట్టం ప్రకారం 6 నెలల పాటు వాహనం అనుమతిని సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. సస్పెన్షన్ సమయంలో ఏదైనా సస్పెండ్ చేయబడిన వాహనం తిరుగుతున్నట్లు గుర్తించినట్లయితే, వాహనాన్ని స్వాధీనం చేయడం జరుగుతుందని, వాహన యజమానులు, డ్రైవర్లు మోటారు వాహన0 నియమాలను ఖచ్చితంగా పాటించాలని, ఓవర్లోడింగ్ను నివారించాలని, సురక్షితమైన ప్రయాణానికి, రవాణాకు సహకరించాలని తెలిపారు.
Admin
E Nivas News