Tuesday, 28 July 2026 07:49:20 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

జిల్లాలో పటిష్టంగా రోడ్డు భద్రత నిబంధనలు అమలు

జిల్లా రవాణా అధికారి సిహెచ్.రంజిత్

Date : 23 December 2025 09:01 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా రవాణా అధికారి సిహెచ్.రంజిత్ మంగళవారంఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనదారులకు సరైన ధ్రువపత్రాలు లేకున్నా, నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యాలయానికి నిర్దేశించిన 69.63 కోట్ల రూపాయల ఆదాయ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 55.48 కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 48 ఓవర్‌ లోడింగ్ కేసులు నమోదు చేయడం జరిగిందని, 77 డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేయడం జరిగిందని, వసూలు చేయబడిన పన్ను,జరిమానాతో కలిపి మొత్తం 27.92 కోట్ల రూపాయలు కాంపౌండింగ్ రుసుము వసూలు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వుల ప్రకారం ఒకే వాహనం ఒక సంవత్సరం లోపు 2వ సారి,అంతకంటే ఎక్కు వసార్లు ఓవర్‌లోడ్ చేయబడినట్లు గుర్తించినట్లయితే, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ అథారిటీ చట్టం ప్రకారం 6 నెలల పాటు వాహనం అనుమతిని సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. సస్పెన్షన్ సమయంలో ఏదైనా సస్పెండ్ చేయబడిన వాహనం తిరుగుతున్నట్లు గుర్తించినట్లయితే, వాహనాన్ని స్వాధీనం చేయడం జరుగుతుందని, వాహన యజమానులు, డ్రైవర్లు మోటారు వాహన0 నియమాలను ఖచ్చితంగా పాటించాలని, ఓవర్‌లోడింగ్‌ను నివారించాలని, సురక్షితమైన ప్రయాణానికి, రవాణాకు సహకరించాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :