ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని గురుకుల పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హాస్టల్ లో అందించే భోజనం నాణ్యత పెంచాలని విద్యార్థులకు రుచికరంగా వంటలు చేయించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. హాస్టల్ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని కలెక్టర్ సూచించారు.రాబోయే 10వ తరగతి పరీక్షలలో ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహించాలని ముఖ్యమైన పాఠ్యాంశాలను రివిజన్ చేయించాలని కలెక్టర్ సూచించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులతోపాటు పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News