ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విశ్వహిందూ పరిషత్ మంథని ప్రకండ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని పోచమ్మవాడ శివనాగ పురి శివనాగేంద్ర స్వామి దేవాలయము ప్రాంగణం లో మహా శివరాత్రి సందర్భంగా నందీశ్వరునికి పూజ చేశారు. శివలింగం చుట్టూ నందీశ్వరులు 5 ప్రదర్శనలు చేయడం జరిగింది. శివ నాగపురి స్థానికులు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నంది పూజ మహోత్సవం నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా.. శివుని వాహనం నందీశ్వరునికి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది అని స్థానికులు చెప్పడం జరిగింది. ముగ జీవాలు మాకు రోజు అన్నో పెట్టే నందులకు పూజ చేయడం గర్వంగా ఉందని నంది యజమాని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమం లో భక్తులు.. విశ్వ హిందూపరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్, సత్సంగ ప్రముక మెడగోని రాజమౌళి గౌడ్, నరేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాస్, కొమురవెల్లి హరీశ్, ప్రచార ప్రముక తూర్పాటి రాము.. గోరక్ష ప్రముక నూక శ్రీనివాస్, వడ్లకొండ శ్రావణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News