ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐఎం అభ్యర్థులను గెలిపించాలని, సిపిఐఎం మండల కార్యదర్శి, కామ్రేడ్ గుండాగాని మధుసూదన్ పిలుపునిచ్చారు. మరిపెడ మున్సిపాలిటీ లోని, 4వ వార్డు నుండి సిపిఎం అభ్యర్థిగా, కామ్రేడ్ బాణాల శైలజ, 5వా వార్డు నుండి కామ్రేడ్ అలువాల మహేష్, 8వ వార్డు నుండి కామ్రేడ్ అల్వాల యాకమ్మ, 12వ వార్డు నుండి కామ్రేడ్ బాణాల రాజన్న, పోటీ చేస్తున్నారు, అనునిత్యం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని,వార్డులలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థుల్ని గెలిపించి అభివృద్ధికి, పట్టం కట్టాలని కట్టాలని ఆయన హితోవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, కామ్రేడ్స్ బోడపట్ల రాజశేఖర్, ఐద్వా మండల కార్యదర్శి దొంతు మమత, రైతు సంఘం మండల నాయకులు ఎస్.కె షరీఫ్, భయ్యా సురేష్, కేవీపీస్ మండల కార్యదర్శి, బాణాల ఎల్లయ్య, చింతరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News