Tuesday, 28 July 2026 06:02:27 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

Date : 14 July 2026 11:42 PM Views : 47

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజ్ కుమార్ లను మంథనిలో అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను జిల్లావ్యాప్తంగా అరెస్టులు చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫాంలు ఇవ్వలేదని పాఠ్యపుస్తకాలు కూడా సరిపడా ఇవ్వకుండా ప్రభుత్వం విద్యార్థులను చిన్నచూపు చూస్తుందన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ లు రాక ప్రైవేట్ కళాశాలలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనె విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :