ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరిలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. జన్మదిన వేడుకలు స్థానిక సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు, ఉపసర్పంచి బియ్యన రాజయ్య, యూత్ నాయకులు, సీనియర్ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు.కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. అనేక సంక్షేమ పథకాలతో పాటు ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దారని రాష్ట్ర సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు.యూత్ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
E Nivas News