ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుండా క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. గురువారంఆయన మీడియాతో మాట్లాడుతూఈ ఆధునిక యుగంలో కూడా రాష్ట్రంలో వర్షాలు కురవద్దంటూ తాను క్షుద్రపూజలు చేశానని కాంగ్రెస్ నేతలు తనపై నిందలు వేయడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాల్లో విమర్శలకు కూడా ఓ హద్దంటూ ఉంటుందని ఏదిపడిదే అది బట్టకాల్చి మీదేస్తే తాను ఊరుకునే ప్రసక్తే లేదని, ఎవరినీ వదిలిపెట్టనని హరీశ్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే గతంలో కూడా మంత్రి కొండా సురేఖ ఇలాగే నోటికొచ్చినట్లుగా మాట్లాడి ఇవాళ నాంపల్లి కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారని హరీశ్ రావు అన్నారు. క్షుద్రపూజల ఆరోపణ అంశంలో ఇష్టం వచ్చిన మాట్లాడిన కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ సూట్, పరువు నష్టం కేసును వేయబోతున్నానని ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చానని అన్నారు. మెయిల్ లీగల్ యాక్షన్కు ఇంకా 30 రోజుల టైమ్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు, స్కాములనుఎత్తిచూపుతున్న నేపథ్యంలోనే రాజకీయంగా ఎదుర్కోలేక తనపై బురదజల్లేందుకు, డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ నేతలు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మైనింగ్ స్కామ్, నాదర్గుల్ భూముల వ్యవహారం, గురుకుల టెండర్ల అవినీతి బయటపెట్టామనే ఆక్రోశంలో ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతాంగం నీళ్లు లేక అల్లాడుతుంటే.. దేవాదులలో 10 మోటార్లు ఉన్నా నేటికీ 4 మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రజల హక్కులు, రైతాంగం, విద్యార్థుల పక్షాల తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని తగ్గేదేలేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Admin
E Nivas News