ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం అంబేద్కర్ కూడలి వద్ద బహుజన రాజ్యాధికార కాంక్షలు నిజం చేసిన మహనీయుడు కాన్సిరాం జయంతి వేడుకలు కాటారం బహుజన సంఘలా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పంతకాని సడువలి మాట్లాడుతూ 1992 నాడు కాన్సిరాంతో కలిసి వేదికను పంచుకొని ఆయనతో కలిసి బ హుజన రాజ్య స్థాపన కోసం పనిచేయడం నాజీవితంలో నాకు దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన స్ఫూర్తితో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలమంతా కలిసి ఐ కమత్యంతో ముందుకు సాగుతూ కాన్సిరాం కళలను నిజం చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నవుల్ల. సంపత్ మహారాజు మాట్లాడుతూ పొలి టికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అనే సిద్ధాంతాన్ని నిజ జీవితంలో నిరూపించి బడుగు బలహీన వర్గాలైన పేద ప్రజలకు అధికారం రుచి చూపించిన మహనీయుడు కాన్సిరాం నిచ్చెన మెట్ల వ్యవస్థ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను, కూలదోషి అందరూ సమానమని చెప్పే అటువంటి స మానత భావం కోసంతన జీవితాన్ని అర్పించిన మహనీయుని జయంతి వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడం రాబోయే రోజుల్లో మంథని నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలైన ప్రజలకు అధికారం అందజేసే బాధ్యతను భాగంగానే ఇంతమంది పెద్దల మధ్య ఈ వేడుక ఇంత ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు జక్కు శ్రావణ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకుల చరిత్ర తప్ప మరో మహానీయుని చరిత్ర తెలియకుండా కొద్ది మంది కుట్ర చేశారని అయిన కూడా అరచేతినీ అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అనేవిధంగా మహానీయుల చరిత్ర గుండె గుండెకు చేరుతుందని ఈ వాస్తవాన్ని ఎవరు ఆపలేరని అన్నారు. కార్యక్రమంలో మనెం రాజబాబు, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు బోడరాజు బొబ్బిలి వెంకన్న. సంజీవని సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొట్టే సతీష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ రఫీ, బిజెపి సీనియర్ నాయకులు బొడ్డు రాజబాబు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండం మల్లారెడ్డి. బహుజన యువ నాయకులు గోనె మహేష్, జాడీ శేఖర్, శ్రీరాముల రజనీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News