ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : దేశాన్ని ఆర్థిక సంస్కరణల దిశగా నడిపించిన మహా మేధావి పీవీ నరసింహారావు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంథని క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పీవీ నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించిన దూర దృష్టి కలిగిన నేత పీవీ అని, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకువెళ్లి, స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలకు బలమైన పునాది వేశారని గుర్తుచేశారు. బహు భాషావేత్త, పండితుడు, రచయితగా అనేక రంగాల్లో భారత మేధస్సుకు ప్రతీకగా నిలిచారన్నారు. పీవీ దూరదృష్టి సేవాభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని, వారి ఆలోచనలు, ఆదర్శాలు మనందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, విద్యుత్ సలహా మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, ఎస్సీ సెల్ నాయకులు మంథని సత్యం, మాజీ సర్పంచ్ ఉడ్నాల శ్రీనివాస్, నాయకులు పోలు శివ, మంథని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News