ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు టీపీసీసీ కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ శనివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ ప్రధాన కోఆర్డినేటర్లుగా ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్, ఎస్.ఐ.ఆర్ కోఆర్డినేటర్ గంప వేణుగోపాల్లను నియమించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్లను నియమించారు. సర్ ప్రక్రియ కోసం వచ్చిన అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు.
Admin
E Nivas News