Tuesday, 28 July 2026 08:39:07 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఆరెంద జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా న్యూట్రిషన్ ఫుడ్ – పోషణ ఆహారోత్సవ కార్యక్రమం

Date : 20 December 2025 06:06 PM Views : 318

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద జడ్.పి.హెచ్.ఎస్ లో కాంప్లెక్స్ హెచ్‌ఎం నరసింహారావు ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ – పోషణ ఆహారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొని, వివిధ రకాల పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. ఆయా ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులే స్వయంగా వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్‌ఎం నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. చిన్నప్పటి నుంచే పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, దీని ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెరుగుతాయన్నారు. స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటే తక్కువ ఖర్చుతో పోషణ మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు కూడా పిల్లల పోషణపై అవగాహన కలిగించడమే లక్ష్యమని నరసింహారావు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము తయారు చేసిన ఆహార పదార్థాల వివరాలను పాఠశాల కమిటీ చైర్మన్ ప్రేమ లతకు, అలాగే తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీలత, సువార్త, పద్మజ, మమత, సి.ఆర్.పీ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :