Saturday, 12 September 2026 11:57:51 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఆరెంద జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా న్యూట్రిషన్ ఫుడ్ – పోషణ ఆహారోత్సవ కార్యక్రమం

Date : 20 December 2025 06:06 PM Views : 341

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద జడ్.పి.హెచ్.ఎస్ లో కాంప్లెక్స్ హెచ్‌ఎం నరసింహారావు ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ – పోషణ ఆహారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55 మంది విద్యార్థులు చురుకుగా పాల్గొని, వివిధ రకాల పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. ఆయా ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులే స్వయంగా వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్‌ఎం నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. చిన్నప్పటి నుంచే పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, దీని ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెరుగుతాయన్నారు. స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకుంటే తక్కువ ఖర్చుతో పోషణ మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు కూడా పిల్లల పోషణపై అవగాహన కలిగించడమే లక్ష్యమని నరసింహారావు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము తయారు చేసిన ఆహార పదార్థాల వివరాలను పాఠశాల కమిటీ చైర్మన్ ప్రేమ లతకు, అలాగే తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీలత, సువార్త, పద్మజ, మమత, సి.ఆర్.పీ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :