ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని ఎం సి హెచ్ లో మాత శిశు సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంథని ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపర్డెంట్ టీ.వీ రాజశేఖర్ రెడ్డి కోరారు. మంథని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ గుంట మౌనిక, చిన్నపిల్లల స్పెషలిస్ట్ డాక్టర్ చిలకలపల్లి నరేష్ ఆధ్వర్యంలో రెండు (సిజిరియన్) సర్జరీలను చేశామని, తల్లి, బిడ్డలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్బంగా హాస్పిటల్ సూపర్డెంట్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రెగ్యులర్ డాక్టర్ లను నియమించడం జరిగిందని, మంథని ప్రాంత గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా మంథని (MCH)లో నాన్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. మంథని ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉంటె 9885808589 నెంబర్ ను సంప్రదించలన్నారు.
Admin
E Nivas News