ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు క్యాతనపల్లి మున్సిపాలిటీలో 45 కోట్ల రూపాయల టి యు ఐ, ఎఫ్ డి సి , సి ఎస్ ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి వివేక్ క్యాతన పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1,2,7,8,9,12,13,14,17 వార్డులలో రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి పనులను మంత్రి వివేక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో ఆయా శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News