Thursday, 30 July 2026 03:28:47 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Date : 06 February 2026 08:54 PM Views : 153

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శాంతినగర్‌లోని పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్సైలు, సీఐలు, ఏసీపీలు, డీసీపీతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించి అవసరమైన ఆదేశాలు, సూచనలు జారీచేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని, ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి లేదా ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :