ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ మండలం సోమనపల్లిలో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను డి.ఈ.ఈ., ఈ డబ్ల్యు ఐ డి సి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ క్రమంలో నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనులలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో పంట కుంట మార్కింగ్ పనులను పరిశీలించి నిబంధనల ప్రకారం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం భీమారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిపాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వంటశాల, పారిశుధ్యం, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలనిఅధికారులు, గుత్తేదారును ఆదేశించారు. పాఠశాలలోవిద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధన, వసతి, భోజనం నాణ్యత అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేస్ లైన్ టెస్ట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారంఅందించాలని, పరిశుభ్రతఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, హాజరు పట్టికలు, నిర్వహణ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News