ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : 2వ సాధారణ మున్సిపల్ ఎన్ని కల నేపథ్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీ కార కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించబడింది. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ, సాధారణ పరిశీలకులు ఫణీంద్ర రెడ్డి ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగినట్లు తెలిపారు. ఆర్డిఓ హరికృష్ణ ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ, చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక ప్రశాంత వాతావరణంలో పూర్తవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది సమ న్వయంతో పని చేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ జయలక్ష్మి, ఈడియం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News