ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామానికి చెందిన అంతర్గం రిషిత గతంలో పాముకాటుతో మృతి చెందింది. ఆమె తండ్రి అంతర్గాం రవి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా హాస్టల్ లో విద్యార్థినిలకు కబడ్డీ టీం12 మందికి డ్రెస్ కోడ్ అందించారు. ఆమె ఎప్పుడూ ఆటలో ఉండాలని ఆమె జ్ఞాపకార్థం కొరకు అందించారు. ఈ సందర్భంగా రిషిత తండ్రి అంతర్గం రవి మాట్లాడుతూ రిషిత నల్ల కంచ స్పోర్ట్స్ అకాడమీ హైదరాబాద్ లో చదువు కుంది. ఖమ్మంలోనీ రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొనేది అని చదువులో మహనీయుల జయంతి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేదని, ఆ జ్ఞాపకాలను స్మరిస్తూ డ్రెస్ కోడ్ అందించడం జరిగిందని రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా ప్రిన్సిపాల్ చల్ల సునీత, పి.టి. రాజేశ్వరి, పాఠశాల టీచర్స్, విద్యార్థులు, కాంగ్రెస్ యూత్ సీనియర్ నాయకులు బీరెల్లి మహేష్, బీరెల్లి రజిని కుమార్ పాల్గొన్నారు.
Admin
E Nivas News