ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బోథ్ అటవీ రేంజ్ పరిధిలో గత నాలుగు రోజుల్లో చిరుత పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిగిని అటవీ ప్రాంత సమీపంలో మేత మేస్తున్న ఆవులపై చిరుత దాడి చేసింది. అడవిలో చిరుతల సంచారం వల్ల సమీప గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పంట చేలల్లోకి వెళ్లడానికి, వ్యవసాయ పనులు చేయడానికి కూలీలు భయపడుతున్నారు. అటవీ విస్తీర్ణం పెరగి నీరు పుష్కలంగా లభించడంతో వన్యప్రాణులు ఆవాసాలుగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. మృతి చెందిన పశువుల యజమానులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడవిలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పొలం పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని సూచించారు.
Admin
E Nivas News