ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాజన్నారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు లో భాగంగా రోడ్డు ప్రమాదంలో జరగకుండా అలైవ్ అరైవ్ కార్యక్రమాన్ని శనివారం సిఐ రమణమూర్తి ఆదేశాల మేరకు జన్నారం మండల కేంద్రం బస్టాండ్ సమీపంలో వాహనదారులుతో కార్యక్రమం పోలిసులు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలను నడిపే సమయంలో ప్రమాదాలకు జరగకుండా వాహనదారులు ఆరోగ్యం ఉండడానికి ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రోడ్డుపై వెళ్లే సమయంలో టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ఫోర్ వీలర్ డ్రైవర్ తప్పనిసరిగా సీట్ బెల్ట్ వేసుకోవాలని వాహనదారులకు పలు జాగ్రత్తలు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్నారం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ లింగన్న, దేవన్న, సురేష్, వాహదారులు, ప్రజలు పాల్గోన్నారు.
Admin
E Nivas News