ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం లో జన సేన పార్టీ, విశ్వ కర్మ సంఘం ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ అమర వీరుడికి జోహార్లు అర్పిస్తూ ఉద్యమ వందనాలు అర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి మహనీయుడి వర్ధంతి ని జన సేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు శ్రీకాంత్ చారి త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలన్నారు. శ్రీకాంత్ చారి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిం చాలని డిమాండ్ చేశారు .శ్రీకాంత్ చారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి అమరత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువరదన్నారు. ఇలాంటి విరుడిని కన్న వారి తల్లి తండ్రుల కు మా పాదాభివందనాలు తెలియ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకాంత్ చారి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, భూమి, ఇల్లు ఇప్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో విశ్వ బ్రహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు రామోజివార్. గంగాప్రసాద్, సంతోష్, నర్సయ్య, సాయినాథ్, సురేష్, జాదవ్ ప్రదీప్, శ్రీనివాస్, అనిల్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News