Thursday, 30 July 2026 03:28:19 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడుదాం...

రాహుల్ గాంధీ...

Date : 03 March 2026 03:15 AM Views : 180

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కులమతాలను రెచ్చగొట్టి,విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీకి చరమగీతం పాడాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. సోమవారం వికారాబాద్ లోని హరిత రిసార్ట్స్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుల రాజకీయ శిక్షణ శిబిరం ముగింపు సభలో ఉద్వేగంగా మాట్లాడారు.కులమత రాజకీయాలకు స్వస్తి చెప్పాలని మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు మనందరం సమిష్టిగా కృషి చేయాలని, మోడీని8 గద్దె దించే వరకు విశ్రమించరాదని తెలిపారు. తమ తమ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని, అవసరమైతే పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి తాను సైతం మీ ప్రాంతానికి వచ్చి మీతో కలిసి పోరాడుతామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఇతర మంత్రులు కూడా పార్టీని మునుమందుల అభివృద్ధి పథంలో నడిపించడానికి సిద్ధంగా ఉండడం సంతోషంగా ఉందన్నారు. ఇదే సరళి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగించేందుకు నాయకులు ఇప్పటినుండే ప్రయత్నాలు చేయాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ని కలిసి తమ జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, సంస్థ గత నిర్మాణాన్ని గురించి వివరించారు. అలాగే వచ్చే అసెంబ్లీ తోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు అహర్నిశలు శ్రమించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేయాలన్నారు. ముందుగా రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి తోపాటు ఉప ముఖ్యమంత్రి తదితర మంత్రులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీతో పాటు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ని కేకేసి రాష్ట్ర చైర్మన్ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి, కేకేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ .సుధీర్ వర్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పంతంగి పాలంక రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :