ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. శుక్రవారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాగారం నుంచి మేడారం వరకు, కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు వాహనాల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పార్కింగ్ కోసం వాహనాలను పొలాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. ఒకవైపు నిర్మాణ పనులు నడుస్తున్న భక్తులు ఏమాత్రం ఆలోచించకుండా ముందస్తుగానే అమ్మవార్ల దర్శనాలు చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ ని దృష్టిలో ఉంచుకొని అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగా భారీ భద్రత ఏర్పాటు చేసింది.
Admin
E Nivas News