Wednesday, 29 July 2026 01:41:08 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య

Date : 01 December 2025 08:35 PM Views : 209

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు సోమవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్ (సమాచారభవన్) ఎదుట సోమవారంధర్నా నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు చెంది వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని జర్నలిస్టులు ముక్తకంఠంతో నిరసించారు.సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య ధర్నానుద్దేశించి మాట్లాడుతూరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కరించలేదని, కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్లస్థలాల ఊసే లేదని, కోర్టు తీర్పు సాకుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు. ఆరోగ్య భీమా పథకాన్ని అటకెక్కించారని, చిన్న మధ్య తరహా పత్రికలను సంక్షోభంలో పడేసారని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందంటేఅంతకంటే ఎక్కువగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి పలు మార్లు హామీలిచ్చారే తప్ప ఆచరణలో పెట్టలేదని, చివరికి జర్నలిస్టుల ప్రతినిధిగా ఉన్న మీడియా అకాడమీ ఛైర్మన్ కూడా కమిటీల పేరుతో కాలయాపన చేసి చివరికి చేతులెత్తేశారని విమర్శించారు. సుప్రీకోర్టు తీర్పును సాకుగా చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇది చాలా అన్యాయమని, ప్రత్యామ్నాయ జీవో ద్వారా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సమస్యలలో ప్రధానమైన ఇండ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులతో పాటు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళలో ఉచిత విధ్య, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయల సహాయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. చిన్న పత్రికలను ఎంపానెల్ లో చేర్చాలని, అడ్వర్టయిజ్మెంట్ పెంటింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మామిడి సోమయ్య కోరారు. ఈ ధర్నాలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో-కన్వీనర్లు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్, ఆర్.వెంకటేశ్వర్లు, కుడుతాడి బాపురావు, ఎం.యాదగిరి, కె.పాండురంగారావు, వివిధ జిల్లాల నాయకులు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షుడు వడ్నాల వెంకన్న సూచన మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి ప్రవీణ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాజ్ ఖాన్, మరియు వివిధ జిల్లాల నుండి కంతేటి రమాదేవి, పద్మనాభరావు, ఉదయ్ భాస్కర్ రెడ్డి, గిరిబాబు, అక్బర్ పాషా, పంతాటి రవీందర్, పి.గోపాల్, ఎం.గోపాల్, జక్కుల విజయకుమార్, స్వామిదాస్, మిట్టపల్లి మధు, మిద్దెల సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, పర్వతాలు, నీల నరేష్ , మల్లేష్, అశోక్,శంకర్, డప్పు రామస్వామి, శాంతి, సౌభాగ్యవతి, సుష్మ, మంజులారెడ్డి, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమాచార పౌరసంబధాల శాఖ కమీషనర్ కు ఇచ్చే వినతి పత్రాన్ని జాయింట్ డైరెక్టర్ డీ ఎస్ జగన్ కు అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :