ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈ విద్యా సంవత్స రంలో టీచర్ల బదిలీ లు ప్రమోషన్ల ప్రక్రియ ఉండబోదని 2027 లో జరిగే దేశవ్యాప్త జనగణ పూర్తయిన తర్వాతే వీటిని చేప డతామని విద్యాశాఖ సెక్రెటరీ యోగిత రాణాస్పష్టం చేశారు. నేడు సచివాలయంలో కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు టీచర్ల బదిలీలు చేప ట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కలిశారు. టీచర్లకు నిర్వహించే టెట్ ను ఆన్లైన్ విధానంలో కాకుండా మాన్యువల్ గానే నిర్వహించాలని వారు కోరారు. బోధించే సబ్జెక్టులకు అనుగుణంగానే టెట్ ఉండాలని అర్హత మార్కులను తగ్గిం చాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.దీనిపై ఆమె స్పందిస్తూఇప్పట్లో బదిలీలు ఉండవని జనగణన ముగిసిన తర్వా తే బదిలీలపై ముందుకెళ్తామని తెలిపారు. వీటిలో కొన్ని అంశాలపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘సర్’ కొనసాగుతు న్నది. తర్వాత జనగణన ఉంటుంది. మొత్తం ప్రక్రియ ముగి యాలంటే 2027 ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.
Admin
E Nivas News