ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లా బోత్ అటవీ క్షేత్ర అధికారి ఆలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడి చేసి 15000 లంచం తీసుకుంటున్న అడవి క్షేత్ర అధికారి ప్రణయ్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ పరుశురాం రెడ్డి హండ్రెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్పి మధు వివరాలు తెలిపారు. ఉపాధి హామీ కింద మొక్కలకు నీరు పోసిన వ్యక్తికి రూ. 5.9 లక్షల బిల్లు మంజూరైంది. బిల్లు విడుదల కోసం అటవీ క్షేత్ర అధికారి ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం ఆ వ్యక్తిని రూ. 40 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ. 15 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధపడుతుంది ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు అటవీశాఖ కార్యాలయంలో గురువారం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండ్గా పట్టుకుని రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ జి. మధు తెలిపారు.
Admin
E Nivas News