ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్ లో నిర్మాణ కార్మికుల పేరు నమోదు చేసుకోవాలని ఏఎల్ఓ రవీందర్ సూచించారు. మంగళవారం కార్మిక సామాజిక భద్రత పథకాలపై అవగాహన సదస్సుల పోస్టర్ ఏఎల్ఓ రవీందర్ మంథనిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సామాజిక భద్రత పథకాలపై జిల్లాలోని రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈనెల 24 నుండి డిసెంబర్ 3 వరకు పది రోజుల పాటు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరిన్ని వివరాల కోసం 9492555248 నంబర్ ను సంప్రదించి అవగాహన సదస్సులను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News