ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగామార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బం దులు పడుతున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేందుకు రేపటి నుంచి రైతు గోస, బీజేపీ భరోసా, పేరిట యాత్రకుఅన్ని ఏర్పా ట్లు పూర్తి చేశామని,ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తా రని.. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. మొదటి రోజు అదిలాబాద్, తాండూర్, లోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అదే రోజు రాత్రి గజ్వేల్ చేరుకుని అక్కడ బస చేసి రెండవ రోజు గజ్వేల్, నుంచి భువనగిరి, వరంగల్, భూపాల పల్లి, చేరుకుని ఆ రాత్రి అక్కడే బస చేసి మూడవ రోజు భూపాలపల్లి నుంచి కాటారం, మంథని, మీదుగా పెద్దపల్లి జిల్లా జిల్లా కేంద్రానికి చేరుకొని పోరుబాట నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. శుక్రవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర నాయకు లు రాంచందర్రావు అధ్యక్షతన అందుబా టులో ఉన్న ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశం నిర్వహించారు.పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్ కూడా దీనికి హాజరయ్యారు. రాష్ట్ర రైతాంగం ఎదు ర్కొంటున్న ఇబ్బందు లపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నడవడం లేదు. లారీలు లేవు, గన్నీ బ్యాగులు లేవు, రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ఇప్పటివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించ లేదు.. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యమే దీనికి కారణం అని మండిపడ్డారు.
Admin
E Nivas News