Thursday, 30 July 2026 12:40:31 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి

ఇంటర్ నోడల్ అధికారిని కల్పన

Date : 03 November 2025 04:51 PM Views : 351

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధనకు అద్యాపకులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని పెద్దపెల్లి జిల్లా నోడల్ ఆధికారిని కల్పన సూచించారు. సోమవారం పట్టణంలోని బాలుర,బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఫలితాలపై చర్చించారు. త్వరగా సిలబస్ పూర్తి చేసి రివిజన్ కు ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. వార్షిక పరీక్షల టైం టేబుల్ విడుదలైన నేపథ్యంలో పరీక్షల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులకు ముఖ గుర్తింపు ద్వారా హాజరు శాతాన్ని పరిశీలించడం జరుగుతుందన్నారు. కళాశాలకు హాజరు కాకపోతే పరీక్ష ఫీజు చెల్లింపు సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షల్లో విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. ఎంతో కీలకమైన ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అనంతరం కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి రికార్డులను తనిఖీ చేశారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :