ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పశువులు అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగ ఇప్పించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి విజయ భాస్కర్ కోరారు. 7వ విడత గాలికుంటు వ్యాది నిరోదక టీకాల కార్యక్రమం లో భాగంగా మంథని మండలం కన్నాలలో 69 గోజాతి, 95 గేదేజాతి పశువులకు పశు వైద్య సిబ్బంధి ఆద్వర్యంలో టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువులలో వ్యాదులు ప్రభలుతున్న దృష్ట్యా వారం రోజూల పాటు మండలంలోని పశువులకు గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు వేశామన్నారు. 6 నేలలు దాటిన అన్నీ ఆవులు, ఎద్దులు, పెయ్యలు, గేదెలు, దున్నలకు ఈ టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి రవి, మండల అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీదేవి, సహాయ పశువైద్య సిబ్బంధి హన్మండ్లు విఎల్ఓ, అజయ్, శ్రీనివాస్ వ్యాక్సి నేటర్,లు పాడి రైతులూ పాల్గొన్నారు.
Admin
E Nivas News