Saturday, 13 June 2026 02:24:15 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

పురపోరులో ‘పొంగులేటి’ మ్యాజిక్ షో..

10 రోజుల్లో.. 249 వార్డుల్లో ప్రచారం... 70 శాతం సక్సెస్ రేటుతో 174 వార్డుల్లో గెలుపు...

Date : 14 February 2026 09:11 PM Views : 122

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : శీనన్న వ్యూహంతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం... తెలంగాణ చీఫ్ బ్యూరో ఫిబ్రవరి 14 :- ఖమ్మం మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ఒక అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంతన్న అప్పగించిన బాధ్యతను సవాలుగా తీసుకున్న ఆయన, తన వ్యూహ చతురతతో ఫలితాలను తలకిందులు చేశారు. కేవలం అంకెలే కాదు.. ఆ అంకెల వెనుక ఉన్న ఆయన కష్టం, ప్రచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 10 రోజుల్లోనే అసాధ్యమనుకున్న సమీకరణాలను సుసాధ్యం చేసి చూపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శీనన్న అడ్డాలో తిరుగులేని హవా... తన సొంత గడ్డపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాలివాటం కాదు.. సునామీ సృష్టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆయన అడుగుపెట్టిన ప్రతిచోటా కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఏదులాపురం లో.. 32 వార్డుల్లో ఏకంగా 24 చోట్ల జయకేతనం ఎగురవేసి సత్తా చాటారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో... సింగరేణి హృదయంలో 22 స్థానాలను కైవసం చేసుకున్నారు. కల్లూరు & సత్తుపల్లి లో... కల్లూరులో 12, సత్తుపల్లిలో 17 వార్డులను హస్తం ఖాతాలో వేశారు. ఇల్లందు&అశ్వారావుపేట లో... ఇక్కడ కూడా ఇల్లందులో 19, అశ్వారావుపేటలో 17 స్థానాల్లో గెలిచి తన పట్టును నిరూపించుకున్నారు. ఓరుగల్లు కోటపై హస్తం జైత్రయాత్ర.... రేవంతన్న ఆశీస్సులతో ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యతలను స్వీకరించిన శీనన్న, అక్కడ కూడా ప్రత్యర్థుల కోటలను బద్ధలు కొట్టారు.భూపాలపల్లి..అత్యంత కీలకమైన ఈ మున్సిపాలిటీలో 16 వార్డులను గెలుచుకుని పట్టు సాధించారు. పరకాల & స్టేషన్ ఘన్‌పూర్...పరకాలలో 13, స్టేషన్ ఘన్‌పూర్‌లో 13 స్థానాలను గెలిపించి జిల్లాలో కాంగ్రెస్ ప్రాభవాన్ని చాటారు. గణాంకాలే సాక్ష్యం.. 249 వార్డుల ప్రచారం.. 174 స్థానాల్లో విజయం!* మొత్తంగా మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించిన 249 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 174 స్థానాలను గెలుచుకుంది. అంటే సుమారు 70 శాతం గెలుపు రేటుతో ఆయన 'మోస్ట్ సక్సెస్‌ఫుల్' లీడర్‌గా నిలిచారు. పగలు రేయి ఏకంచేసి ఆయన సాగించిన సుడిగాలి పర్యటనలు, రేవంతన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు కల్పించిన భరోసా ఓట్ల వర్షంగా కురిసింది. మాట ఇస్తే తప్పని నైజంతో, అభివృద్ధిపై ఉన్న నిబద్ధతతో శీనన్న ప్రజాప్రభుత్వంలో తన మార్క్ రాజకీయాలను మరోసారి చాటిచెప్పారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :