ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రభుత్వం మున్సిపాలిటీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయడంతో ఆయా పార్టీల నాయకులు టికెట్ల కోసం నియోజకవర్గ ఇన్చార్జీలతో మంతనాలు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటనతో పార్టీల కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులతో రహస్య మంతనాలు జరుపుతూన్నట్లు సమాచారం. మంథని పురపాలక సంఘం పరిధిలోని కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, ఇతర పార్టీల కార్యకర్తలు పురపాలక ఎన్నికల్లో బీ ఫాముల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం స్థానికంగా ఉండే కార్యకర్తలు తమకు టికెట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా మరికొంత మంది వారి వార్డుల్లో రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో పక్క వార్డులపై దృష్టి సారిస్తున్నట్లు వినికిడి. ఆశావాహుల అభ్యర్థనలు మంతనాలు మునిసిపాలిటిక్స్ లో ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటన ఆయా పార్టీల నాయకులకు తలనొప్పిగా మారిందని పలువురు చర్చించుకుంటున్నారు.
Admin
E Nivas News