ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరూర్ క్యాంప్లో ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 3న అర్ధరాత్రి సమయంలో ఆలయ తాళం పగలగొట్టి దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు మరియు హుండీలోని నగదును దొంగిలించిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.4,357/- నగదుతో పాటు దేవుడికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై ఆలయ పూజారి సముద్రాల జగన్మోహన్ చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్64/2026 కింద 331(4), 305(a) బి.ఎన్.ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సై ఎం. సుప్రియ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి6 న కరీంనగర్ రోడ్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా, పంచల సమక్షంలో వారిని విచారించారు. విచారణలో వారు ఆలయంలో జరిగిన దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News