ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కన్నెపల్లి, లంబాడిపల్లి దారి మధ్యలో ఐకెపి సెంటర్ గ్రౌండ్ లో సోమవారం నిర్వహించిన ముగ్గుల పోటీకిలకు మంత్రి వివేక్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీ పైన అందించే వ్యవసాయ పనిముట్లను కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు రాయితీ పైన అందించడం జరిగిందన్నారు. మంచిర్యాల జిల్లా కు 2కోట్ల 40 లక్షల రాయితీ పనిముట్లు వచ్చాయన్నారు. అందులో చెన్నూరు నియోజకవర్గానికి సుమారు 40 లక్షల రాయితీ రావడం ఆనందంగా ఉందన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న రాయితీలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యవసాయం చేయడం జరిగిం దన్నారు. దేశంలోనే మన రాష్ట్రం వ్యవసాయంలో నంబర్ వన్ గా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News