Tuesday, 15 September 2026 08:27:50 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 24 October 2025 07:33 PM Views : 353

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా చెన్నురు నియోజకవర్గం మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలు, పారిశుధ్య నిర్వహణ అంశాలను మున్సిపల్ కమిషనర్ రాజు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, పారిశుధ్య నిర్వహణలో భాగంగా వార్డులలోని ప్రతి ఇంటి నుండి ప్రతి రోజు తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని తెలిపారు. ప్రతి ఇంటికి ఎలాంటి అంతరాయం లేకుండా త్రాగునీరు సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సరీలలో నాటేందుకు అవసరమైన మొక్కలను అభివృద్ధి చేయాలని, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో రెండు పడకగదుల ఇండ్ల పథకంలో భాగంగా నిర్మించిన భవనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.అమృత్ 2.0 పథకంలో భాగంగా మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న నీటి బ్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం మందమర్రి మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ రాజలింగుతో కలిసి అభివృద్ధి పనుల పురోగతి, పారిశుధ్యం, నర్సరీల నిర్వహణ, తాగునీటి సరఫరా, రెండు పడక గదుల ఇండ్ల పథకం నిర్వహణపై సమీక్షించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :