ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు సంక్రాతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు రంగోలి, పతంగితో పాటు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ మహాత్మా మాట్లాడుతూమన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. ప్రతి విద్యార్థి భారత దేశ పండుగల గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నారు.రంగు రంగుల ముగ్గులతో విద్యార్థులు అలరించారు. వైకుంఠ పాళి, ఇతర ఆటలు సృజనాత్మకంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ సురేష్, అధ్యాపకులు సంధ్య రాణి, శ్రీనివాస్, చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News