Wednesday, 29 July 2026 10:34:02 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

రెండు పంటకు తక్షణమే సాగునీటిని వెంటనే విడుదల చేయాలి...

మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Date : 12 January 2026 10:09 PM Views : 178

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గూడెం లిఫ్ట్ ని బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సోమవారం సందర్శించారు. అనంతరం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ గూడెం లిఫ్ట్ దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు ఒక జీవన ఆధారం అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉండడం వల్లనే మూడు టీఎంసీల గూడెం లిఫ్ట్ మంజూరు అయిందన్నారు. 2015 నుండి గూడెం లిఫ్ట్ ద్వారా రైతులకు అందిస్తున్నా మన్నారు. గతంలో పెద్ద ఎత్తున వర్షాలు పడడం వలన గూడెం లిఫ్ట్ కు సంబంధించిన కేబుల్స్, తెర పరికరాలు పాడైపోయిన సందర్భంలో దాదాపు 11.50 కోట్ల రూపాయలతో కేబుల్ వెడ్స్, ఇతర పరికరాలను ఏర్పాటుచేసి రెండో పంటకు నీరు అందజేసినామన్నారు. గతంలో అధిక వర్షాలతో కడెం గేట్లు తెరుచుకోలేదు అప్పుడు ఎలాగైనా పంటకు నిరంధించాలని, ప్రత్యేక దృష్టి పెట్టి గేట్లు తెరిచేటట్లుగా కృషి చేశామని తెలిపారు. పైపుల ద్వారా నీరు అందించినప్పటికీ మాటిమాటికి పైపులు బాడవుతున్న సందర్భంలో రెండున్నర కిలోమీటర్ల మేరకు నూతన పైప్ లైన్లు వేయించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వాన్నిదని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మరియు గూడెం లిఫ్ట్ మంజూరులో, నిర్మాణంలో ఎవరి ప్రమేయం లేదు ఇది కేవలం దివాకర్ రావు ఘనత అన్నారు. వర్షానికి వైర్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు మాటి మాటికి పాడవుతున్న సందర్భంలో 1 కోటి 59 లక్షల రూపాయలతో వైర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వర్షపు నీటిలో తడిచి పాడవకుండా బిల్లింగ్ కూడా మంజూరు చేయించడం జరిగిందన్నారు. రైతులకు నీరు అందక తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఎమ్మెల్యే చెరువు తీసుకొని నీటిని రెండో పంటకు తక్షణమే నీటిని అందించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పంటలు ఎండిపోయాయి అని బిజెపి పార్టీ నాయకులు అవగాహన లేకున్నా విమర్శలు చేస్తున్నారని, తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు నీరు అందించిన విషయం రైతులందరికీ తెలుసన్నారు. దండేపల్లి లక్షెట్టిపేట మండలాల రైతుల ప్రయోజనాల కోసం రెండో పంటకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ నల్మాస్ కాంతయ్య, దండేపల్లి మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, దండేపల్లి మాజీ వైస్ ఎంపీపీ అనిల్, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :