ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ఇంటర్మీడి యట్ విద్యా మండలి మార్చి-2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, అలాగే మే-2026 అడ్వాన్స్డ్ సప్లిమెం టరీ పరీక్షల్లో ఉత్తీర్ణు లైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లలాంగ్ మెమోల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. జనరల్ , ఒకేషనల్ కోర్సులకు సంబం ధించిన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్ల ముద్రణ ప్రక్రియను బోర్డు విజయవంతం గా పూర్తి చేసింది. ఒకటి రెండు రోజుల్లో మెమోలు కళాశాలల కు చేరనున్నాయి. ఉత్తీర్ణులైన విద్యార్థు లు తమ తమ కళా శాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సర్టిఫికెట్ల ను స్వీకరించవచ్చని అధికారులు వెల్లడించారు. సర్టిఫికేట్లకు భద్రత కోసమే ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈసారి విద్యా మండలి పాస్ సర్టిఫికెట్ల ముద్రణలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలను పాటించింది. నకిలీ డూప్లికేషన్ సర్టిఫికెట్ల తయారీకి లేదా ట్యాంపరింగ్కు ఎలాంటి అవకాశం లేకుండా ప్రతి పాస్ సర్టిఫికెట్లో 25 ప్రత్యేక భద్రతా ఫీచర్లను చేర్చారు. ముద్రించిన సర్టిఫికెట్ల ను ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు , నోడల్ అధికారులకు అప్పగించారు. జిల్లా అధికారుల పర్యవే క్షణలో ఈ సర్టిఫికెట్ల ను సంబంధిత జూని యర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు చేరుస్తున్నారు. విద్యార్థులు నేరుగా తమ కాలేజీల వద్దకు వెళ్లి ఒరిజినల్ మెమో లను తీసుకోవాలని ఇంటర్ బోర్డు సూచిం చింది. పరీక్షల్లో ప్రతిభ చాటి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థు లకు, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది.
Admin
E Nivas News