ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కామారెడ్డి జిల్లాలోని బిబీ పేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 5 వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే వీజీ సెట్ మరియు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించే బ్యాక్ లాగ్ సెట్ దరఖాస్తు తేదీని జనవరి 21 నుండి జనవరి 25వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రిన్సిపల్ గోపీచంద్ రాథోడ్ బుధవారంఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యార్ధులు అర్హులైన పేద, మధ్య తరగతి విద్యార్థినీ విద్యార్థులు అవసరమైన అన్నీ సర్టిఫికెట్ లతో ఆన్లైన్ ద్వారా గాని లేదా సమీప మీ సేవ కేంద్రాల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 22వ న రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
Admin
E Nivas News